Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 43 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 43,263 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,31,39,981 కి చేరింది. కొత్త కేసుల్లో అత్యధికంగా కేరళలో నమోదైనవే ఉన్నాయి. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 338 మంది మృతి చెందారు. 40,567 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకూ కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,41,749కు చేరింది. 3,93,614 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,23,04,618. దేశంలో మొత్తం 71,65,97,428 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img