దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గుముఖంపట్టడంతో యాక్టివ్ కేసులు కూడా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 4,362 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,67,315కు చేరింది. ఇందులో 4,23,98,095 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,102 మంది బాధితులు మరణించగా, 54,118 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 66 మంది మరణించగా, 9620 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. తాజాగా రికవరీ రేటు 98.68 శాతానికి పెరిగింది. గత 24వంటల్లో 9,620 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం రికవరీలు 4.23 కోట్లు దాటాయి. మరోవైపు దేశంలో 178 కోట్ల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య శాఖ ప్రకటించింది.