Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 44,643 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 44,643 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,56,757 కి పెరిగింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 464 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 4,26,754 కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 41,096 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,10,15,844 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,14,159 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 49,53,27,595 కరోనా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img