దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గింది అనుకొనే సమయంలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 44,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా బారినపడి 496 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. వైరస్ బారి నుంచి 32 వేల మంది నిన్న కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్ వల్ల 4,36,861 ప్రాణాలు కోల్పోయారు.నిన్న కేరళలో 30,077 మందికి కరోనా నిర్ధారణ అయింది. 162 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. గురువారం మరో 79,48,439 కొవిడ్ టీకా డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు 61 కోట్ల మంది కొవిడ్ టీకాలు వేయించుకున్నారు.