Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

దేశంలో కొత్తగా 45,352 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 45,352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289కు చేరింది. ఇందులో 3,99,778 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,20,63,616 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 4,39,895 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 34,791 మంది బాధితులు కోలుకోగా, 366 మంది మృతిచెందారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతున్నదని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 67,09,59,968 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.కాగా, దేశంలో గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 32,097 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయని పేర్కొన్నది. రాష్ట్రంలో కొత్తగా 188 మంది మరణించారని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img