దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో 47,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. 509 మంది మృతి చెందగా.. 35,181 మంది పాజిటివ్ బాధితులు కోలుకున్నారని పేర్కొంది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,57,937కు పెరిగింది. 3,20,28,825 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 4,39,529 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 3,89,583 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్లో భాగంగా 66,30,37,334 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.