Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశంలో కొత్తగా 6,168 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 6,168 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,42,507కు చేరాయి. ఇందులో 4,38,55,365 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,932 మంది మరణించారు. మరో 59,210 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9685 మంది కరోనా నుంచి బయటపడగా, 21 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. రోజువారీ రికవరీ రేటు 1.94 శాతంగా ఉందని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.13 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.68 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు 212.75 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img