Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 67,084 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖంపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,084 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,24,78,060కు చేరాయి.ఇందులో 4,11,80,751 మంది మహమ్మారి నుంచి కోలుకోగా 5,06,520 మంది బాధితులు మృతిచెందారు. మరో 7,90,789 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,241 మంది మరణించారు. కరోనా కేసులు తగ్గడంతో రోజువారీ పాజిటివిటీ రేటులో కూడా తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం రోజువారీ పాజిటిరేటు 4.44 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.86 శాతానికి పడిపోయాయని వెల్లడిరచింది. ఇక 1,71,28,19,947 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img