Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశంలో కొత్తగా 7,145 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కానీ కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు ఒమిక్రాన్‌ 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపించింది. బాధితుల సంఖ్య 111కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే 40 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 12,45,402 మంది కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 7,145 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కు చేరింది.. ఇందులో 3,41,71,471 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. . మరో 4,77,158 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. ప్రస్తుతం 84,565 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 8706 మంది కరోనా నుంచి కోలుకున్నారని, మరో 289 మంది మృతిచెందారని వెల్లడిరచింది. ఇప్పటివరకు 1,36,66,05,173 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img