Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశంలో కొత్తగా 7,554 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కేసుల సంఖ్య భారీగా తగ్గగా.. మంగళవారం స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 7,554 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటికంటే 9శాతం కేసులు పెరిగాయి.కరోనా బారినపడి నిన్న 223 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.90 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 85,680 (0.20%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,29,38,599 కి పెరిగాయి. ఇప్పటివరకు 5,14,246 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 14,123 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,38,673 కి చేరింది. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,77,79,92,977 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది. నిన్న 8,55,862 మందికి టీకాలను వేశారు. కాగా.. దేశంలో ఇప్పటివరకు దాదాపు 77 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img