Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 8309 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 8309 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,80,832కు చేరింది. ఇందులో 3,40,08,183 మంది కోలుకున్నారు. మరో 1,03,859మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కరోనా బారినపడి ఇప్పటివరకు 4,68,790 మంది మృతిచెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో 9905 మంది కరోనా నుంచి బయటపడగా, 236 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్‌ కేసులు 544 రోజుల కనిష్ఠానికి చేరాయని తెలిపింది. ఇక రికవరీ రేటు 98.34 శాతంగా ఉందని పేర్కొన్నది. కొత్తగా నమోదైన కేసుల్లో 4350 కేసులు కేరళలోనే ఉన్నాయని, 159 మంది మరణించారని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img