Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

దేశంలో కొత్తగా 861 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 861 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఆరుగురు చనిపోయారు. మరో 929 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 5,21,691 మంది మరణించగా, ఇంకా 11,058 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 11,058గా ఉంది. క్రియాశీల రేటు 0.03 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ఇప్పటివరకు 185 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులను వేశారు. నిన్న ఒక్క రోజే 2.4 లక్షల మంది టీకా వేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img