Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 9,119 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 396 మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,45,44,882కు చేరగా, 4,66,980 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు 3,39,67 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,09,940 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. యాక్టివ్‌ కేసులు 539 రోజుల కనిష్ఠానికి చేరాయని తెలిపింది.ఇక దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 132 కోట్లకుపై వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడిరచింది. అందులో ఇంకా 22.72 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని, వాటిని వాడాల్సి ఉన్నదని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img