Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 9355 కరోనా కేసులు

  • దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ రోజూ 9 వేలకు పైనే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 2,29,175 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,355 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న ఒక్కరోజే 9,629 కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లగా ఉంది. ఇక దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 60 వేలకు దిగువకు నమోదయ్యాయి. ప్రస్తుతం 57,410 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి నుంచి 4,43,35,977 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,424గా నమోదైంది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా ఉందని, వారంరోజుల సగటు పాజిటివిటీ రేటు 5.36 శాతం ఉన్నట్టు కేంద్రం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img