దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. బుధవారం 8954 కేసులు నమోదవగా తాజాగా అవి 9 వేలు దాటాయి. దీంతో నిన్నటికంటే ఇవి 8 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా బారిన పడి 477 మంది మృత్యువాతపడ్డారు.దేశంలో ప్రస్తుతం 99,763 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 8,546 మంది కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,46,06,541కి చేరింది.ఇందులో 3,40,37,054 మంది కోలుకోగా, 4,69,724 మంది మృతిచెందారు.దేశంలో ఇప్పటివరకు 1,24,96,19,515 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో బుధవారం ఒకేరోజు 80,35,261 మంది టీకా ఇచ్చామని తెలిపింది. అలాగే కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.