తాజాగా 33,376 కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 33,376 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,08,330కు చేరింది. ఇందులో 3,91,516 కేసులు యాక్టివ్గా ఉండగా, మహమ్మారి బారినపడి 4,42,317 మంది మరణించారు. కోలుకున్న వారి సంఖ్య 3,23,74,497గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. గడిచిన 24 గంటల్లో 308 మంది మరణించారని, 32,198 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 73,05,89,688 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇందులో నిన్న ఒక్కరోజే 65,27,175 మందికి వ్యాక్సినేషన్ చేశామని తెలిపింది. కాగా, నిన్నటివరకు మొత్తం 54,01,96,989 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) వెల్లడిరచింది. శుక్రవారం 15,92,135 మందికి పరీక్షలు చేశామని తెలిపింది.