Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో గత పదేళ్లలో 20 శాతం తగ్గిన సంతానోత్పత్తి

ఏపీలో 50.7 శాతం, తెలంగాణలో 52.6 శాతం
నేటి తరం మహిళల సంతానోత్పత్తిపై ప్రభావం పడుతోంది. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో సాధారణ సంతానోత్పత్తి రేటు (జీఎఫ్‌ఆర్‌) 20 శాతం తగ్గినట్టు ‘శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ డేటా 2020’ తెలిపింది. ప్రతి వెయ్యి మంది మహిళలకు ఒక ఏడాదిలో జన్మించిన చిన్నారుల సంఖ్యను జీఎఫ్‌ఆర్‌ గా చెబుతారు. 15-49 సంవత్సరాల వయసులోని వారిని ఈ గణాంకాల పరిధిలోకి తీసుకుంటారు. జమ్మూకశ్మీర్‌ లో జీఎఫ్‌ఆర్‌ 29 శాతం తగ్గిపోయింది. 2008 -2010లో సగటు జీఎఫ్‌ఆర్‌ 86.1గా ఉంటే, 2018-20 మధ్య కాలంలో ఇది 68.7కు తగ్గింది. చిత్రమేమిటంటే పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పరిస్థితి దారుణంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి క్షీణత 15.6 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 20.2 శాతంగా ఉంది. జీఎఫ్‌ఆర్‌ గణాంకాలు జనాభావృద్ధి తగ్గుదలను సూచిస్తున్నాయని, ఇది మంచి సంకేతమేనని ఎయిమ్స్‌ ఆబ్సెట్రిక్స్‌ మాజీ హెడ్‌ సునీతా మిట్టల్‌ అన్నారు. వివాహం చేసుకుంటున్న వారి వయసు పెరగడం, మహిళల్లో అక్షరాస్యత శాతం పెరగడం, ఆధునిక సంతాన నిరోధక సాధనాల రాక సంతానోత్పత్తి తగ్గడానికి కారణం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img