దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖంపడుతున్నాయి. ఇది ఊరట కలింగించే విషయమైనా..కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఇద్దరిలో ఈ వేరియంట్ వెలుగు చూడగా, మరికొందరు అనుమానితులు పర్యవేక్షణలో ఉన్నారు. తాజాగా విడుదలైన నమోదైన కరోనా గణాంకాలను పరిశీలిస్తే, దేశంలో గడిచని 24 గంటల్లో 12,52,596 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..8,603 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు తగ్గాయి. ఇక వైరస్ నుంచి నిన్న 8,190 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసులు లక్ష దిగువనే కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 415 మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా 4.7 లక్షల మృత్యుఒడికి చేరుకున్నారు.