Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో నేడు 273 రైళ్లు రద్దు

దేశంలోని పలు రాష్ట్రాల్లో రాకపోకలు సాగించే 273 రైళ్లను ఇండియన్‌ రైల్వే అధికారులు శనివారం రద్దు చేశారు. నిర్వహణ, ఆపరేషనల్‌ సమస్యలతో 253 రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేశామని రైల్వే అధికారులు ఐఆర్సీటీసీ వెబ్‌సౖౖెట్‌లో ప్రకటించారు.. మరో 20 రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని రైల్వే అధికారులు చెప్పారు. దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, జార?ండ్‌, బీహార్‌, గుజరాత్‌, తెలంగాణ, అసోం రాష్ట్రాలకు రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు వివరించారు. రైళ్ల రద్దు వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img