దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,561 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతోపాటు.. ఈ కరోనాతో నిన్న 142 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1 శాతానికి తక్కువగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 77,152 (0.20%) కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,29,45,160 కి పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,14,388 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 14,947 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,53,620 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.62 శాతానికిపైగా ఉంది. వరుసగా 25 రోజుల నుంచి లక్షకు దిగువన కేసుల సంఖ్య నమోదవుతోంది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో రికార్డు స్థాయిలో 178.02 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. నిన్న 21 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. వీరితో కలిపి 178,0263,222 డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.