Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

కొత్తగా 2,503 పాజిటివ్‌ కేసులు
దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ అనంతరం రోజువారీ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,503 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,93,494కు చేరాయి. ఇందులో 4,24,41,449 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,15,877 మంది మరణించగా, 36,168 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో 4377 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, 27 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడిరచింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.47 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 36,168 (0.08%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 77.90 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని, నిన్న ఒక్కరోజే 5,32,232 మందికి పరీక్షలు నిర్వహించామని ఆరోగ్యశాఖ చెప్పింది.దిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 180.19 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img