ఏడు వేల దిగువనే పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 6,396 మందికి కరోనా పాజిటివ్ తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 201 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,29,51,556 చేరగా, మృతుల సంఖ్య 5,14,589కు చేరింది. నిన్న 13,450 మంది కోవడ్ నుంచి కోలుకోగా, మొత్తం రివకరీలు 4.23 కోట్లకు చేరింది. ఇక క్రియాశీల కేసులు 69,897 చేరాయి. కొత్తగా నమోదవుతున్న కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. అదేవిధంగా ఇప్పటివకు 1,78,29,13,060 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నది.