దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖంపడుతున్నాయి. . గత వారం రోజుల నుంచి పాజిటివ్ కేసులు ఐదు వేలకు మించట్లేదు. 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 97 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడిరచింది.దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 43 మిలియన్లకు చేరుకున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 515,974 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ రోజు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో వర్చువల్ కాన్ఫరెన్స్లో ప్రసంగించనున్నారు. ఎందుకంటే 12-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కోవిడ్-19 టీకాలు వేయడం మార్చి 16 నుండి ప్రారంభం కానుంది.12-14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు టీకా, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరనున్నారు.