ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. కన్నూర్ జిల్లాలో వెలుగుచూసినట్లు సోమవారం ఆ రాష్ట్ర వైద్యశాఖ ధ్రువీకరించింది. వివరాల్లోకి వెళితే, కన్నూర్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ బయటపడిరదని ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ వెల్లడిరచారు. ప్రస్తుతం అతను వైద్యకళాశాలలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిపై దృష్టి సారించామని తెలిపారు. ఇదిలా ఉండగా..ఇటీవల ఈ మహమ్మారి తొలి కేసు కేరళలో కొల్లాంకు చెందిన వ్యక్తిలో గుర్తించారు.