Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో మరోసారి 2వేలకు పైగా కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 1247 కేసులు నమోదవగా, తాజాగా మరో 2,067 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబైలో ఇన్‌ఫెక్షన్లు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దిల్లీ (632), కేరళ (488) ప్రభావమే మొత్తం కేసులపై ఎక్కువగా కనిపిస్తోంది. వైరస్‌ కారణంగా కొత్తగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,547 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 30లక్షల 47వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేల మార్కును అధిగమించింది. దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. మంగళవారం 17,23,733 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,90,56,607కు చేరింది. మరో 4,21,183 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 5,96,511 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ధాటికి 2,302 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img