దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 41,195 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,77,706కు చేరింది. ఇందులో మొత్తం 3,12,60,050 మంది డిశ్చార్జి అయ్యారు.తాజాగా 39,069 మంది బాధితులు కోలుకోగా మరో 490 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,29,669 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్లో భాగంగా 52.36 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.