Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో గత కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా కేసులు పెరిగాయి. బుధవారం 5 వేల కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 6422కు పెరిగింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,16,479కి చేరింది. ఇందులో 4,39,41,840 మంది కోలుకోగా, 5,28,250 మంది మృతిచెందారు. మరో 46,389 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 5,748 మంది కరోనా నుంచి బయటపడ్డారని, 14 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.రెండు రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 2.04 శాతానికి పెరిగిందని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు 215.98 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, బుధవారం ఒక్కరోజే 31,09,550 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img