Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో వరుసగా రెండో రోజూ 4 వేలకుపైగా కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వరుసగా రెండో రోజూ నాలుగు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం 4270 మందికి పాజిటివ్‌ నిర్ధారణకాగా, నేడు మరో 4518 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు 43,181,335కు చేరాయి. ఇందులో 4,26,30,852 మంది బాధితులు కోలుకోగా, ఇప్పటివరకు 5,24,701 మంది మృతిచెందారు. ఇంకా 25,782 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9 మంది మరణించగా, 2,779 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. నిన్న 2.57 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 194 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img