దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 2,685 కరోనా కేసులు నమోదయ్యాయి. ముందు రోజు కంటే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. ఇప్పటివరకు మొత్తం కేసులు 4,31,50,215కు చేరగా, 5,24,572 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 16,308 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 33 మంది మరణించారు. 2,158 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతానికి పెరిగిందని, యాక్టివ్ కేసులు 0.04 శాతం, రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని తెలిపింది. శుక్రవారం 14,39,466 మందికి వ్యాక్సినేషన్ చేశామని, దీంతో ఇప్పటివరకు 1,93,13,41,918 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.