Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. శుక్రవారం 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనితోపోల్చితే కొత్తగా రికార్డయిన కేసులు 3.6 శాతం తక్కువ. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు చేరింది. ఇందులో 3,13,38,088 మంది బాధితులు కోలుకోగా, 3,87,673 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 478 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు 4,30,732 మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. 53.61 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img