కొత్తగా 16,156 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 16,156 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,42,31,809కు పెరిగాయి. ఇందులో 1,60,989 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,36,14,434 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా బారినపడి మరో 4,56,386 మంది మరణించారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 27 వరకు 60,44,98,405 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) తెలిపింది. ఇందులో నిన్న ఒక్కరోజే 12,90,900 మందికి పరీక్షలు చేశామని వెల్లడిరచింది.