Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..


గడిచిన 24 గంటల్లో 1,72,433 పాజిటివ్‌ కేసులు
దేశంలో గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,72,433 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు..కరోనా బారినపడి నిన్న 1008 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో గతంలో నమోదైన మరణాల సంఖ్యలో మార్పులు చోటుచేసుకుంటుండంతో మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. నిన్నటితో పోల్చుకుంటే.. 6.8 శాతం కేసులు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 2,59,107 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,33,921 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4,98,983 బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 167.87 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img