Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోంది.గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నిన్న 30,615 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 514 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారంతో పోల్చుకుంటే.. కరోనా కేసుల సంఖ్య 11 శాతం పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.దేశంలో ఇప్పటివరకు మొత్తం 4.23 కోట్ల మందికి వైరస్‌ సోకింది. అందులో 4.18 కోట్ల మంది కోలుకున్నారు.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 82,988 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో 3,70,240 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 173.86 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img