Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,745 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా వైరస్‌ బారినపడి ఆరుగురు మృతి చెందగా.. మరో 2,236 మంది బాధితులు కోలుకొని డిశార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 18,386 ఉన్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.60శాతంగా ఉందని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,31,60,832 చేరింది. ఇందులో 4,26,17,810 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,24,636 మంది ప్రాణాలు వదిలారు. ఇదిలా ఉండగా.. దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1,93,57,20,807 టీకా డోసులు పంపిణీ వేసినట్లు వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img