Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో 1,082 కరోనా కొత్త కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 1,082 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,59,447కి చేరింది. ప్రస్తుతం దేశంలో 15,200 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 7 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,486కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98. 78శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.71 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img