కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖంపడుతోంది. కొత్త కేసులు 231 రోజులు, క్రియాశీల కేసులు 227 రోజుల కనిష్టానికి క్షీణించాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. గడిచిన 24 గంటల్లో 19,470 మంది కరోనా నుంచి కోలుకోగా, గడిచిన 24 గంటల్లో 164 మంది మరణించినట్లు తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా 1,83,118 ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు మహమ్మారిబారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,52,454గా ఉన్నది. దేశవ్యాప్తంగా అత్యధికంగా కేరళలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 6676 కేసులు రికార్డు అయ్యాయి. ఇక దేశంలో 164 మంది మరణించగా, దాంట్లో 60 మంది కేరళలోనే ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 98.67 కోట్ల కోవిడ్ టీకా డోసులను ఇచ్చారు.