Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో 1,574 కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,65,901 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,574 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,50,662కి చేరింది. నిన్న ఒక్కరోజే 2,161 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా తొమ్మిది మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,29,008కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.77 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.62 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img