Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో 174 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 1,94,968 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 174 మందికి పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,757కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,257 కేసులు పాజిటివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో ఒకరు, కేరళలో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,725కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడిరచింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.16 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img