Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో 20వేల దిగువకు కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మరోసారి 20వేల దిగువకు చేరాయి. క్రియాశీల కేసులు కూడా 206 రోజుల కనిష్టానికి చేరడం ఊరటనిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 19,740 కరోనా కేసులు నమోదవ్వగా, 248 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 24 గంటల్లో 23,070 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య దేశంలో 3,32,48,291 లకు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,36,643 కరోనా యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు 3,39,35,309 మంది కరోనా బారిన పడ్డారు. కేరళలో శుక్రవారం 10,944 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇక వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు మాత్రమే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img