Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో 24 గంటల్లో 7,533 కొత్త కేసులు.. 44 మరణాలు

దేశంలో కరోనా వైరస్‌ దేశంలో కరోనా వైరస్‌వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 7,533 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 53,852 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,47,024 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 44 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,468కి చేరింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.12 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక దేశంలో ఇప్పటి వరకూ 220.66 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img