Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశంలో 360 కొత్త కేసులు..

దేశంలో తాజాగా 360 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,46,70,075కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి 4,41,33,433 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 6,046కు తగ్గాయి. గత 24 గంటల్లో 5 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,596కు చేరింది. ఇక, దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.80 శాతం, మరణాలు 1.19శాతంగా ఉందని పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 219.87 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img