దేశంలో మరో 3,947 కరోన పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,87,307కు చేరింది. ఇందులో 4,40,19,095 మంది బాధితులు కోలుకోగా 5,28,629 మంది మరణించారు. మరో 39,583 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9 మంది మృతిచెందగా, 5096 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కొత్తగా నమోదన కేసుల్లో అత్యధికంగా 1445 కేసులు కేరళలోనే ఉన్నాయి. తమిళనాడులో 531, మహారాష్ట్ర 453, పశ్చిమబెంగాల్ 284, కర్ణాటకలో 266 మంది కరోనా బారినపడ్డారు. ఇక ఇప్పటివరకు 218.18 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.