300 పైనే కరోనా మృతుల సంఖ్య
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 18,870 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..మహమ్మారి బారినపడి 378 మంది మృతి చెందారు.28,178 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 3,37,16,451కి చేరింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,29,86,180గా ఉంది. ఇప్పటివరకు మొత్తం మరణా సంఖ్య 4,47,751 కి చేరింది.ప్రస్తుతం దేశంలో 2,82,520 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.