ఏడుగురు రిజిస్ట్రార్లపై వేటు
65 లక్షల పత్రాల పరిశీలన
30 వేలు నకిలీగా గుర్తింపు
కడప, కృష్ణా జిల్లాల్లో భారీ అవినీతి
అమరావతి : నకిలీ చలానాల కుంభకోణంపై రిజిస్ట్రే షన్ శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒక వైపు రికవరీలు, మరో వైపు చర్యల ప్రక్రియలో అధికార యంత్రాంగం వేగం పెచించింది. దీనికి బాధ్యులు, సూత్ర ధారులను వెలికి తీస్తోంది. ఈ కుంభ కోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు సబ్ రిజిస్ట్రార్లపై వేటు వేశారు. తొమ్మిది క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు భవిష్యత్లో ఈ తరహా అక్రమాలకి చోటు లేకుండా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు. నాలుగు రోజులగా అధికారులు ఆయా కార్యా లయాల్లో 65లక్షల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లని తనిఖీ చేయగా 30వేల డాక్యుమెంట్లు నకిలీ వని గుర్తించినట్లు తెలిసింది. నకిలీ చలానాల కుంభకోణంపై రెండు రోజులలో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వనున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో సుమారు రూ.3 కోట్ల వరకు, ఆ తర్వాత కడప జిల్లాలో కోటి రూపాయిలకి పైగా అవినీతి జరిగినట్లు అధికారులు చెబుతు న్నారు. డాక్యుమెంట్ రైటర్లు, సబ్రిజిస్ట్రార్లు, మధ్యవర్తుల పాత్రపైనా లోతైన విచారణ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూడటం పెద్దఎత్తున చర్చకు దారితీసింది. ఈ అవినీతి వ్యవహా రంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్గా ఉండటం, బాధ్యులపై తగిన చర్యలకు ఆదేశించడంతో అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తులో నిమగ్నమయ్యారు. కడప, విజయనగరం జిల్లాల్లోని సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు, వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఇందులో కొందరు సిబ్బందిపైనా వేటు వేశారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన ఎనిమిది జిల్లాల్లో నకిలీ చలానా దందా కొనసాగింది. నకిలీ చలానాలను సృష్టించి అవినీతికి పాల్పడ్డారు. భవిష్యత్తులో సామాన్యుడికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఇలాంటి నకిలీ దందా ముఠాను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలకు ఉపక్రమించింది.