నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. రోగి బంధువులే అతని కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వైద్యుని దగ్గరకు లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. గత నెల 31న సాయంత్రం జబ్బు పడిన ఓ వ్యక్తిని అతని బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఓపీకి కొద్ది దూరంలో కూర్చోబెట్టారు. ఓపీ మధ్యాహ్నం వరకే ఉండటంతో అతను ఆ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. మరుసటి రోజు ఏప్రిల్ 1న ఉదయం ఓపీ ప్రారంభమైన తరువాతౌ అతడితో వచ్చి న వారు ఓపీలో రిజిస్టర్ చేయించారు. రెండో అంతస్తులో వైద్యుడి దగ్గరకు వెళ్లాలని చీటీ ఇచ్చారు. రెండో అంతస్తుకు వెళ్లాలంటే లిఫ్ట్ దాకా వెళ్లాలి. అక్కడికి వెళ్లాలంటే స్ట్రెచర్ కావాలి. కానీ ఆస్పత్రిలో స్ట్రెచ్చర్ అందుబాటులో లేదు. కనీసం వీల్ చైర్ కూడా లేదు. దాని ఫలితం ఈ అమానుష దృశ్యం.
పట్టపగలు. ఆస్పత్రిలో సూపరింటెండెంట్ నుంచి వార్డ్బాయ్ దాకా అంతా ఉంటారు. అందరూ చూస్తూ ఉండిపోయారే తప్ప.. ఎవరూ స్ట్రెచర్ తెచ్చి ఇచ్చింది లేదు. కనీసం ఏమైంది అని అడిగివాడే లేడు. వాస్తవానికి ఈ ఘటన మార్చి 31న జరిగినా బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు ఆస్పత్రి నిర్వాహకులు. కానీ ఇలాంటి విషయాలు ఆగుతాయా.. సోషల్ మీడియా ద్వారా బయటపడింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిని చూసిన వారు ాఅసలేంటి ఈ దౌర్బాగ్యం్అంటూ ఆస్పత్రి నిర్వహణా సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.