Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నా విజయం వ్యక్తిగతం కాదు.. ఆదివాసీలది

నూతన రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము
వార్డు కౌన్సిలర్‌గా మొదలైన తన ప్రమాణం రాష్ట్రపతి పదవి చేపట్టేవరకు కొనసాగిందని నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ఆమె ప్రసంగించారు.కౌన్సిలర్‌గా మొదలైన తన ప్రయాణం భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకు కొనసాగిందని భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతరం రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది తన వ్యక్తిగత విజయం కాదని.. దేశంలోని గిరిజన, దళితుల విజయమని పేర్కొన్నారు. తన ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీకని, బాధ్యతల నిర్వహణకు ప్రజల విశ్వాసం మరింత బలాన్నిస్తుందన్నారు. దేశ 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సమయంలో రాష్ట్రపతిగా ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఓ సాధారణ ఆదివాసీ మహిళ అయిన తాను దేశ అత్యున్నత స్థానానికి చేరుకోవడం ప్రజాస్వామ్యం గొప్పదనమని పేర్కొన్నారు.గతంలో రాష్ట్రపతులుగా పనిచేసిన వారంతా ఆ పదవికే వన్నె తెచ్చారని.. తాను కూడా వారి బాటలోనే పయనిస్తానని ద్రౌపది ముర్ము అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంకల్పంతో ముందుకెళ్లాలని.. వచ్చే 25 ఏళ్లలో అద్భుమైన పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు చదువుకోవడం తన కల అని, తమ గ్రామంలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలిక తానేనని తెలిపారు. దేశ అత్యున్నత పదవికి ఎన్నిక కావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌ సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్‌ ముఖ్యమంత్రులు, ఎంపీలు దౌత్య కార్యాలయాల అధిపతులు, ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఇటీవలి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై గెలవడం తెలిసిందే. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆమె గతంలో ఆ రాష్ట్ర మంత్రిగా రెండేళ్లపాటు పనిచేశారు. రaార్ఖండ్‌ గవర్నర్‌ గానూ సేవలందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img