న్యూదిల్లీ: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణంగానే ఉంటుందని, దీనివల్ల సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని గురువారం వాతావరణశాఖ తెలిపింది. వర్షపాతం 1971-2020 కాలంలో 87 సెంటీమీటర్ల దీర్ఘకాల సగటు(ఎల్పీఏ)లో 96 శాతం నుంచి 104 శాతం ఉంటుందని వివరించింది. అంతకుముందు 1961`2019 మధ్య కాలంలో ఎల్పీఏ ఉంటుందని తెలిపింది. దేశం ఉత్తర భాగం, మధ్య భారతదేశం, హిమాలయాల దిగువ ప్రాంతాల్లో, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖ వివరించింది.