Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నేడు నడ్డా రాక.. చెప్పులు మోసేది ఎవరంటూ కేటీఆర్‌ ట్వీట్‌

బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఇవాళ జేపీ నడ్డా చెప్పులు మోసే గులాం ఎవరంటూ సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. మునుగోడు బహిరంగ సభ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి హైదరాబాద్‌ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అమ్మవారిని సందర్శించి ఆలయం నుంచి బయటకు వస్తుండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. అమిత్‌ షా చెప్పులు తీసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. బండి సంజయ్‌పై అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా విమర్శలకు దిగింది. ఢల్లీి నేతల చెప్పులు మోసే నాయకులంటూ టీఆర్‌ఎస్‌ నేతలు బహిరంగ విమర్శలు చేశారు.అయితే, ఇవాళ హన్మకొండ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్న సందర్భంగా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘‘పాప్‌ క్విజ్‌.. ఈరోజు జేపీ నడ్డా చెప్పులు మోసే గులాం ఎవరు..? దీనికి తీవ్రమైన పోటీ ఉంటుందని కచ్చితంగా అనుకుంటున్నాను’’ అంటూ ఒక నవ్వు సింబల్‌తో సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img