ఖాట్మండు : నేపాల్కు భారత్ ఆపన్నహస్తం అందించింది. 75 అంబులెన్సులు, 17 స్కూలు బస్సులను అందజేసింది. రెండు దేశాల మధ్య పటిష్ట, సుదీర్ఘకాల సంబంధాల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లోని 75 అంబులెన్సులు, 17 స్కూలు బస్సులను వేర్వేరు ప్రభుత్వ శాఖలకు, ఎన్జీవోలకు అందించనున్నారు. ఆయా వాహనాల తాళాలను నూతనంగా నియమితులైన భారతీయ దౌత్యాధికారి నవీన్ శ్రీవాత్సవ నేపాల్, విద్యశాఖ మంత్రి దేవంద్ర పౌడెల్ సమక్షంలో అందజేశారు. భారత్ స్వాతంత్య్రానికి 75ఏళ్లకు ప్రతీకగా 75 అంబులెన్సులను అందించినట్లు భారతీయ దౌత్యకార్యాలయం వెల్లడిరచింది.