Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నోటి ద్వారా కరోనా టీకా.. పంపిణీ మొదలుపెట్టిన చైనా

ప్రపంచంలోనే మొదటిసారిగా నోటి ద్వారా తీసుకునే టీకాని పంపిణీ చేసింది చైనా.. కరోనాకు విరుగుడుగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన టీకాలన్నీ సూది ద్వారా ఇస్తున్నారు. అయితే చైనా మాత్రం తొలిసారి నోటి ద్వారా తీసుకునే టీకాను అందుబాటులోకి తీసుకొచ్చి షాంఘైలో పంపిణీ చేసింది. ఈ వ్యాక్సిన్‌లో ఉండే ద్రవాన్ని నోటితో పీల్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం 20 సెకన్లలోనే ముగుస్తుంది. ఇప్పటికే వ్యాక్సిన్‌ను పంపిణీ చేసిన చైనా.. ఈ నోటి టీకాను బూస్టర్‌ డోస్‌గా ఇస్తోంది. నోటి ద్వారా టీకాను తీసుకోవడం వల్ల వైరస్‌ శ్వాసనాళంలోకి వెళ్లకముందే అంతం చేయొచ్చని నిపుణులు తెలిపారు. చైనాకు చెందిన కాన్‌సినో బయోలాజిక్స్‌ ఈ టీకాను అభివృద్ధి చేసింది. చైనాతోపాటు హంగేరి, పాకిస్థాన్‌, మలేసియా, అర్జెంటీనా, మెక్సికో దేశాల్లో ఈ టీకాకు పరీక్షలు నిర్వహించింది. ఈ టీకాకు చైనా సెప్టెంబరులోనే అనుమతి ఇచ్చింది. దీంతో తాజాగా పంపిణీ మొదలైంది. మనదేశంలో ముక్కుతో తీసుకునే కరోనా టీకాను భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే అభివృద్ధి చేసినప్పటికీ పంపిణీ మాత్రం ఇంకా మొదలు కాలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img